సంఘం ప్రాథమిక విషయాలు(శాఖ, మిలన్, ఉత్సవం పరిచయం)

సఫల #కార్యపద్ధతి #సంఘశాఖ*

విధర్మీయులు మన దేశాన్ని వారు శక్తివంతులుగా ఉండి ఆక్రమించుకోలేరు మన లోపాల్ని పసిగట్టి అదనుచూసి ఆక్రమించారు అంటే శత్రువు బలం కారణంగా మనం బానిసత్వంలోకి వెళ్ళలేదు మన సమాజంలోని బలహీనత కారణంగా మనల్ని మన భవిష్యత్ తరాలు బానిసత్వంలోకి వెళ్లి ఓడిపోయాము.

అసలు మన జాతి బలహీనం కావడానికి అనైక్యత క్రమశిక్షణారాహిత్యం సమయపాలన లేకపోవడం మరియు నలుగురితో కలిసి పని చేయకపోవడం అనేవి ప్రధాన కారణాలు అని డాక్టర్ జి సమాజాన్ని అధ్యయనం చేసిన తర్వాత సంఘ్ ని ప్రారంభించడం జరిగింది.
సంఘ కార్యక్రమాలు కార్యక్రమాలు గానే ఉండిపోయింది ఇది నిరంతర సాధన మనకున్న లక్ష్యాన్ని చేరు ఉపకరించే విధంగా మన కార్యక్రమ నిర్వహణ విధానం ఉండాలి.
చెప్పింది విని సంఘం నడవలేదు చూసి నేర్చుకోవడం వల్లనే సంఘం నిలబడింది.
శాఖ జరుగుతే సంస్కారం వస్తుంది అనుకుంటే పొరపాటు శాఖ జరగాల్సిన విధంగా జరిగితేనే సంస్కారం నిర్మాణం అవుతుంది.
సంఘంలో లభించేది కేవలం ఆనందం మాత్రమే.

శిక్షణ పొందుతారు. *క్రమశిక్షణ వారి రక్తంలో రంగరించుకుపోతుంది. #శారీరకమైన #క్రమశిక్షణ #కన్నా #మానసిక #క్రమశిక్షణ #మరింత #ముఖ్యమైనది. తమ వ్యక్తిగతమైన భావోద్వేగాలను, ప్రవృత్తులను మహోన్నతమైన జాతి హితం కొరకు అంకితం చేసే పద్ధతిని వారు అలవర్చుకుంటారు.* ఆ విధంగా సంఘంలో రూపొందే
ఆదర్శప్రాయమైన క్రమశిక్షణ, జాతియెడల ప్రగాడ సమర్పణ భావం నుండి జనించేది కాబట్టే అది స్వయంస్వీకృతం. వ్యక్తిలో అంతర్నిహితమై ఉన్న శక్తిసామర్థ్యాలను అటువంటి క్రమశిక్షణ జాతీయ సంక్షేమానికి అనువుగా పెంపొందించి, వికసింపజేసితీరుతుంది. *పురుషపుంగవోవితమైన సద్గుణాలన్నీ పూర్తిగావికసించి, పరస్పర ప్రేమ సహకారభావాలతో నిండి, #స్వయంస్ఫూర్తితో #అలవరచుకున్న #క్రమశిక్షణతో #అన్యోన్యఅనుబంధం కలిగి, #ఒక్కసారి #కలిసికట్టుగా #కార్యరంగంలో #దూకగలిగిన #వ్యక్తులే, #అక్షయ #జాతీయశక్తి #విధానాలను #సృష్టించగలుగుతారు.*

ఈ విధంగా,దేశవ్యాప్త సమైక్య సౌభ్రాతృత్వాన్ని నిండుగా నిలకడగా నిష్టతో నిత్యము నిర్మించి జాతి పవిత్ర పాదాల చెంత అనుశాసనంతో నిత్యము స్వయంసేవకులు, సేవికలు అంకితమవుతున్నారు.. 

*మన దైనందిన శాఖ ఆహ్వానాన్ని మనము అందుకుని మనమంతా దేశ నిర్మాణంలో కార్యోన్ముఖులము కావాలి.*

శాఖ

సమయం వారీగా శాఖలు
* ప్రారంభంలో సాయంశాఖ మాత్రమే మొదలైంది. ఎందుకంటే ఆ సమయంలో సంఘంలో ముఖ్యంగా విద్యార్థి స్వయంసేవకులే వస్తుండేవారు.

* విద్యార్థులు రకరకాల వృత్తులవారుగా, ఉద్యోగులుగా తర్వాత, వారికి సాయంశాఖకు వెళ్ళడం కష్టంకావడంతో, అప్పుడు 'ప్రభాత్ శాఖలు' ప్రారంభమయ్యాయి.

* గ్రామాలలో సంఘకార్యం విస్తరించడంతో రైతులు మరియు కార్మికులలో పని పెరగడంతో 'రాత్రి శాఖలు' కూడా ప్రారంభమయ్యాయి.

* సాధారణంగా ప్రభాత్ శాఖలలో ప్రౌఢ, తరుణ వృత్తులవారు, ఉద్యోగులు వస్తారు; సాయం శాఖలలో విద్యార్ధి స్వయంసేవకులు వస్తుంటారు.

*వయసు వారి శాఖలు*
"బాల మరియు విద్యార్థితరుణ శాఖలు సంఘానికి ప్రాణమయితే, తరుణశాఖలు సంఘానికి వెన్నెముక, ప్రౌఢ శాఖలు సంఘానికి శోభను తెస్తాయి.”

విద్యార్థి శాఖలు -  బాల, కిశోర, కళాశాల విద్యార్థిశాఖ 
సంయుక్త శాఖ - బాల + కళాశాల విద్యార్థిశాఖ 
(((బాల శాఖల యొక్క లక్ష్యం
సంస్కారాల నిర్మాణం
తరుణశాఖల యొక్క లక్ష్యం
శాఖల విస్తరణ మరియు సంఘకార్యానికి అధిక సమయం)))

సాయంశాఖ (విద్యార్థి శాఖలు)

సాయంశాఖలు శిశు మరియు బాల, తరుణ విద్యార్థులను సంస్కారవంతులను చేయడంలో ఎక్కువ ఉపయోగపడతాయి. తర్వాతితరం కార్యకర్తలు ఈ శాఖల్లోనే తయారవుతారు. కాబట్టి సంఘకార్యానికి వెన్నెముక ఈ విద్యార్థి శాఖలే.

కళాశాల విద్యార్థి శాఖలు- తరుణ విద్యార్థుల కోసం అవసరమైన శారీరక మరియు బౌద్ధిక్ కార్యక్రమాల యోజన, అమలు కోసం ఈ శాఖలు విడిగా ఉండాలి. కొత్త తరుణ కార్యకర్తలు (విస్తారక్ లేదా ప్రచారక్) కూడా ఈ శాఖల నుండే అధికంగా బయటికొస్తారు

ఉద్యోగి శాఖ - ఉద్యోగుల శాఖ, తరుణ వృత్తులు, ప్రౌఢ శాఖ
(యువక/ ప్రౌఢవృత్తులు, ఉద్యోగులు, రైతులు, కార్మికుల శాఖ)
ఉద్యోగి శాఖల యొక్క లక్ష్యం
సామాజిక పరివర్తన
ప్రౌఢ శాఖల యొక్క లక్ష్యం
అత్యధిక సమయం సంఘ కార్యానికి ఇవ్వడం

ఈ శాతం ఎక్కువగా ప్రభాత్ మరియు రాత్రి శాఖలు
అయి ఉంటాయి.
1. సమాజంలో సంఘానికి విస్తృతమైన ఆధారం కల్గించడానికి,
2. సమాజంలోని దోషాలను దూరంచేయడం, వ్యక్తులను వ్యసనముక్తులను చేయడంకోసం (కేరళలోని రాత్రి శాఖల ఉదాహరణ)
3. సమాజం మరియు దేశ విరోధి శక్తులకు వ్యతిరేకంగా ధీరులైన యువకులను నిలబెట్టడంకోసం

సాప్తాహిక్ మిలన్
మండలి లేదా ఆగిపోయిన శాఖాస్థానంలో సాప్తాహిక్ మిలన్ (వారానికి ఒకరోజుశాఖ) ను ప్రారంభించాలి.

* సాప్తాహిక్ మిలన్ జరిగే రోజు, స్థలం, సమయం మరియు ప్రముఖ్న నిర్ణయించాలి.

* దగ్గరలోని శాఖనుండి సాప్తాహిక్ మిలన్కు 'మిలన్ పాలక్'ను నిర్ణయించాలి.

* ప్రార్ధన తప్పనిసరి; అయితే ధ్వజం అవసరంలేదు.

* మిలనను మెల్లమెల్లగా దైనందిన శాఖగా మార్చడానికి ప్రయత్నం జరగాలి.

మిలన్, మండలి ప్రముఖులు మరియు పాలక్లకు నియమితంగా ప్రశిక్షణనివ్వాలి.

* వయస్సు ఆరోగ్యం, స్థాయి చూసి సరైన శారీరక, బౌద్ధిక్కార్యక్రమాలు నిర్వహించడం సంఘమండలి

* స్వయంసేవక్ లేదా కార్యకర్తలేని కొత్తస్థలాల్లో మండలి ప్రారంభించడం అవసరం.

* ఈ స్థలం కొత్తది కావచ్చు. సంపర్కం జరిగిన లేదా గతంలో శాఖ జరిగిన స్థలమూ కావచ్చు.

* నెలకు కనీసం ఒకసారి, నిర్ణీత దినాన, నిర్ణీత సమయం, స్థలంలో ఏకత్రీకరణ.

* సంఘమండలికి ప్రముఖ్ను కూడా నిర్ణయించాలి.

* సంఘమండలిలో ధ్వజం లేదా ప్రార్ధన అవసరంలేదు.

* సంఘమండలిలో శారీరక, బౌద్ధిక్ లేదా హిందుత్వ జాగరణకు చెందిన ఏదైనా కార్యక్రమం తీసుకోవచ్చు.

* సంఘమండలిలో వచ్చేవారి వయస్సు, ఆరోగ్యం, స్వభావం, వాతావరణం మరియు సంఘస్థాన్కు అనుగుణ్యంగా కార్యక్రమాలు నిర్వహించవచ్చు.

* కొంతకాలం తర్వాత సంఘమండలిని సాప్తాహిక్ మిలన్గా మార్చాలి.

మన ఉత్సవాలు -ప్రాధాన్యత 

1. ఉగాది - చైత్రశుద్ధ పాడ్యమి.
సంఘ స్థాపకులు పరమ పూజనీయ డాక్టర్జి జన్మదినం
నిత్యనూతనం చిరపురాతనం హిందూ జీవనం..
సమయం యొక్క విలువ...
భారతీయ వైజ్ఞానిక కల్పన

2. హిందూ సామ్రాజ్య దినోత్సవం - జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి
మనందరిలో హిందూ స్వాభిమానాన్ని నింపి స్వరాజ్యానికి కృషిచేసిన వీరులు శివాజీ... 1674 సంవత్సరంలో జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు వారు పట్టాభిషిక్తుడైన సందర్భాన్ని పురస్కరించుకుని మనం హిందూ సామ్రాజ్య దినోత్సవం జరుపుతాము.

ముఖ్య ఉద్దేశం:
హైందవ చైతన్యాన్ని పెంపొందించడం
హిందూస్వాభిమానాన్నీ నిర్మాణం చేయడం

3. గురుపూజ - ఆషాఢ పూర్ణిమ
చైతన్యవంతమైన సమాజాన్ని ధర్మ మార్గంలో నడిపించేందుకు గురువు అవసరం.. హిందూ సమాజానికి అనాదిగా ప్రతీకగా నిలుస్తున్న కాషాయ పతాకం భగవధ్వజ్ ను గురువుగా స్మరిస్తూ మనం గురుపూజ నిర్వహిస్తాం.

ముఖ్య ఉద్దేశం :
స్వయంసేవకులలో సమర్పణ అనే సంస్కారాన్ని పెంపొందించుట 

4. రక్షాబంధన్ - శ్రావణ పూర్ణిమ
సంపూర్ణ సమాజాన్ని సంఘటితం చేయడం
సంఘం సర్వవ్యాపి సర్వస్పర్శి

సోదర భావం నిర్మాణం 
సమాజంలో ఐక్యతకై సమరసత నిర్మాణం, సమాజంలో ఆత్మీయత పెంచడం
సంఘం సమాజంలోని కి వెళ్లి సమాజాన్ని సంఘంలో కి తీసుకు రావడం

5. విజయదశమి - ఆశ్వయుజ శుద్ధ దశమి
సంఘం ప్రారంభించబడిన రోజు
శక్తిశాలి హిందూసమాజ నిర్మాణం ముఖ్య ఉద్దేశం.

6. మకర సంక్రాంతి - సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే రోజు
సమాజంలో పరివర్తన (చెడు నుండి మంచి వైపు మరలాలి) రావాలి అనే భావనను సమాజంలో తీసుకెళ్లడం...

ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన సూచనలు:

• ఉత్సవం జరిగే ప్రదేశం శుభ్రం చేసుకోవాలి.
• ధ్వజాన్ని ఉతికి ఇస్త్రీ చేయాలి.
• ధ్వజానికి ధ్వజం కంటే కొద్దిగా ఎక్కువ పొడవుగా వున్న పూలమాల ఉండాలి.
• (పోటోలకి) డాక్టర్జీ, గురుజీ భారతమాత చిత్ర పటాలు పెట్టి వాటికి పూల మాలలు వేయాలి.
కార్యక్రమానికి పిలిచిన వ్యక్తిని ముఖ్య అతిథి గానే సంబోంధించాలి.
• ప్రారంభంలో ఈల, చివరలో ఈల తప్పక ఉపయోగించాలి.
• అనుకున్న సమయానికి ప్రారంభం కార్యక్రమాన్ని ప్రారంభం చేయాలి.
• మంచి అలంకరణ చేయవలెను.
• పాద రక్షలకు, వాహనములకు రేఖాంకన్ వేయవలెను.
కార్యక్రమ యోజనంతయు కాగితంపై వ్రాసి వేదికపైన ఉంచాలి. నిర్వహణ ముఖ్య శిక్షక్ చేయాలి.

ఆరు ఉత్సవాలను ఏదైనా ఒక ఉత్సవం సేవ బస్తీలో జరిగే విధంగా యోజన చేయాలి.

సేవాబస్తీలో భారత మాత పూజ చేయాలి

Comments

Popular posts from this blog

సంక్రాంతి ఉత్సవం బౌద్ధిక్ బిందువులు